Thursday, April 25, 2024

కోల్‌కతాతో మ్యాచ్… చివరి బంతికి చెన్నై విజయం

ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చెన్నై టీమ్ మళ్లీ అగ్రస్థానానికి చేరింది. ఆదివారం మధ్యాహ్నం కోల్‌కతాతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో చెన్నై చివరి బంతికి విజయం సాధించింది. 172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై టీమ్‌కు ఓపెనర్లు గైక్వాడ్(40), డూప్లిసెస్(43) మంచి శుభారంభం ఇచ్చారు. అనంతరం మొయిన్ అలీ(32) రాణించగా.. రైనా, ధోనీ వికెట్లను సీఎస్‌కే జట్టు వరుసగా కోల్పోయింది. దీంతో ఆ ధోనీ సేన కష్టాల్లో పడింది. చివర్లో జడేజా(22) మెరుపు ఇన్నింగ్సుతో చెన్నై గెలిచింది. కోల్‌కతా బౌలర్లలో నరైన్‌కు 3వికెట్లు దక్కగా, ప్రసిద్ధ్ కృష్ణ, ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి, రసెల్ తలో వికెట్ తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement