Saturday, April 20, 2024

CSKకు ధోనీ తర్వాత విలియమ్సన్ కెప్టెన్: ఓజా

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కేన్ విలియమ్సన్‌ను సరిగ్గా వాడుకోవడం లేదని, ధోనీ స్థాయిలో కెప్టెన్సీ చేయగల ఒకే వ్యక్తి విలియమ్సన్ అని టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అభిప్రాయపడ్డాడు. రాబోయే సీజన్‌లో ధోనీ ఐపీఎల్ నుంచి వైదొలుగుతాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో చెన్నైకి సారథి ఎవరవుతారనే చర్చ జరుగుతోంది. ఈ అంశంపై ఓజా తాజాగా స్పందించాడు. తర్వాతి సీజన్‌లో ధోనీ ఆడకపోతే చెన్నై జట్టు కేన్ విలియమ్సన్‌ను దక్కించుకునే అవకాశం ఉంది. ధోనీ స్థాయిలో చెన్నై టీమ్‌ను ముందుకు నడిపించగల సత్తా విలియమ్సన్‌కు ఉంది. హైదరాబాద్ టీమ్ విలియమ్సన్‌ను సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది వేలం జరిగితే చెన్నై టీమ్‌కు విలియమ్సన్ మంచి ఆప్షన్ అని ఓజా అభిప్రాయపడ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement