Saturday, April 20, 2024

బాధితుడికి చెక్కుఅందజేసిన మంత్రి ‘స‌త్య‌వ‌తి రాథోడ్’..

బయ్యారం ప్రభ న్యూస్ : మండలం లోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన పిల్లి వీరాస్వామి అనే వ్యక్తికి ముఖ్య మంత్రి సహాయనిధినుండి మంజూరీ అయిన రెండు లక్షల రూపాయల చెక్కును రాష్ట్ర శిశు సంక్షేమ గిరిజన శాఖా మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అందజేశారు.వీరాస్వామి గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హైదరాబాద్ లోని నిమ్స్ వైద్యులు శస్త్ర చికిత్స అవసమని తెలిపారు. ఈ విషయం మంత్రి దృష్టికి తీసుకు వెళ్లగా వారు సిఎమ్ఆర్ఎఫ్ నుండి రెండు లక్షల రూపాయలను మంజూరీ చేయించి చెక్కును వీరస్వామి కి అందజేశారు. తనకు ఆర్థిక సహాయం చేసిన కేసీఆర్ కు.. మంత్రి సత్యవతి రాథోడ్ కు.. జెడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగో త్ బిందుకు.. వీరాస్వామి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement