Friday, March 29, 2024

టీఆర్ఎస్ ఎంపీ బండా ప్రకాష్‌పై చీటింగ్ కేసు

టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ బండా ప్రకాష్‌పై హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. అల్లూరి ట్రస్టులో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎంపీ బండా ప్రకాష్ అవకతవకలకు పాల్పడినట్లు మల్లారెడ్డి అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కోర్టు ఆదేశాలతో ఎంపీపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాఘవేంద్ర మీడియాకు వెల్లడించారు.

హన్మకొండ న్యూశాయంపేటలోని అల్లూరి ట్రస్ట్, అల్లూరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సంస్థకు కార్యదర్శిగా టీఆర్ఎస్ ఎంపీ బండా ప్రకాష్ వ్యవహరిస్తున్నారు. 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాలకు దాఖలు చేసిన ఇంకమ్ ట్యాక్స్ విషయంలో ఎంపీతో పాటు ఛార్టెడ్ అకౌంటెంట్లు అత్తలూరి సత్యనారాయణ, అత్తలూరి వంశీధర్ రూ.12.91 లక్షల మేరకు నిధులు దుర్వినియోగం చేసినట్లు పిటిషనర్ మల్లారెడ్డి ఆరోపించారు. దీంతో ప్రాథమిక ఆధారాలను పరిశీలించి ఎంపీ సహా అకౌంటెంట్లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ వార్త కూడా చదవండి: టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవితకు జైలుశిక్ష

Advertisement

తాజా వార్తలు

Advertisement