Saturday, April 20, 2024

ప్రశాంతంగా యాత్ర చేస్తే ప్రభుత్వానికి భయమెందుకు? : బండి సంజ‌య్

బైంసా ప్ర‌జ‌ల నుంచి న‌న్ను ఎవ‌రూ దూరం చేయ‌లేర‌ని, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పాదయత్రను కొనసాగిస్తానని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. క‌రీంన‌గ‌ర‌ల్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ‌లో బీజేపీ బ‌ల‌ప‌డ‌డం చూడ‌లేక‌నే పాద‌యాత్ర‌ను అడ్డుకోవాల‌ని టీఆర్ ఎస్ చూస్తుంద‌న్నారు. ఎంఐఎం, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్ర కొనసాగిస్తానని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం.. మజ్లిస్ నేతలు చెప్పినట్లు నడుస్తోందన్నారు. బైంసాకు వెళ్లాలంటే వీసా తీసుకోవాలా?, బైంసా ఈ దేశంలో, తెలంగాణలో లేదా?, ప్రశాంతంగా యాత్ర చేస్తే ప్రభుత్వానికి భయమెందుకు? అని ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement