Thursday, April 25, 2024

Breaking: భారత్ జోడో యాత్ర తెలంగాణ రూట్ మ్యాప్ లో మార్పులు

తెలంగాణలో భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ లో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. అక్టోబర్ 24న తెలంగాణలోకి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర ఎంటరవుతుంది. తెలంగాణలోని మక్తల్ నియోజకవర్గ పరిధిలోని కృష్ణా బ్రిడ్జి గుండా ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మక్తల్ నుంచి దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ముత్తంగి, సంగారెడ్డి, జోగిపేట, శంకరం పేట, మద్నూర్ ల గుండా రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. తెలంగాణలో 15 రోజుల పాటు 350 కిలోమీటర్ల వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement