Thursday, April 25, 2024

అమిత్ షా తెలంగాణ పర్యటనలో మార్పులు

తెలంగాణ‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రానికి ఈ నెల 12న రావాల్సిన అమిత్ షా ఒక‌రోజు ముందుగానే.. ఈ నెల 11న హైదరాబాద్‌కు రానున్నారు. 12న సంగారెడ్డిలో జరగాల్సిన బీజేపీ మేధావుల సమావేశం రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర నేతలు తెలిపారు. 11న హైదరాబాద్‌కు వస్తోన్న షా.. రాష్ట్ర ముఖ్య‌ నేతలను కలిసి చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మొదట అమిత్ షా ఈనెల 12న రాష్ట్రానికి రానున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే 12న ఆయన కేరళ వెళ్లనున్న నేపథ్యంలో ఒకరోజు ముందే హైదరాబాద్‌కు రానున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర నాయకులు షా పర్యటనకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement