Saturday, April 20, 2024

ఎస్సై, కానిస్టేబుళ్ళ తుది రాతపరీక్ష తేదీల్లో మార్పు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు సంబంధించిన పరీక్షలు ఉన్న నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ తేదీల్లో మార్పులు చేశారు. ఏప్రిల్‌ 23వ తేదీన జరగాల్సిన కానిస్టేబుల్‌ రాత పరీక్షను 30వ తేదీకి మార్చారు. అలాగే కానిస్టేబుల్‌ (ఐటీ విభాగం) పరీక్షను కూడా ఏప్రిల్‌ 23వ తేదీ నుంచి 30వ తేదీకి, ఎస్సై(ఐటీ) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి, ఏఎస్సై( ఫింగర్‌ ప్రింట్స్‌) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్పు చేస్తూ రాష్ట్ర పోలీసు నియామకాల మండలి (టీఎస్‌పీఆర్‌బీ) నిర్ణయం తీసుకుంది.

పోలీస్‌ ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహించే శారీరక, సామర్థ్య పరీక్షలు కూడా ఇటీవలే పూరైన విషయం తెల్సిందే. ఈవెంట్స్‌ నిర్వహణకు గాను మొత్తంగా 11 కేంద్రాల్లో 25 రోజులు పాటు నిర్వహించారు. అభ్యర్థులు మారిన పరీక్షా తేదీలను గమణించాలని ప్రభుత్వం కోదింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement