Friday, April 19, 2024

Breaking | చంద్ర‌న్న సంక్రాంతి కానుక కార్య‌క్ర‌మంలో అప‌శృతి.. తొక్కిస‌లాట‌లో ముగ్గురు మృతి

గుంటూరు జిల్లా వికాస్ నగర్ లో జరిగిన చంద్రన్న సంక్రాంతి కానుక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. దీంతో ఓ మహిళ చ‌నిపోయిన‌ట్టు తెలుస్తోంది. పలువురికి గాయాల‌య్యాయి. చంద్రబాబు సభ అనంతరం చంద్రన్న సంక్రాంతి కానుకలకోసం ఒక్కసారిగా జ‌నాలు తోసుకు రావ‌డంతో ఈ తొక్కిస‌లాట జరిగింది. కాగా, మ‌రో ముగ్గురికి తీవ్రగాయాలైనట్టు ప్రాథమిక సమాచారం. అయితే.. మరో ఇద్దరు మహిళలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement