Friday, April 19, 2024

స్వగ్రామాలకు ముంపు గ్రామాల ప్ర‌జ‌లు..సారెతో సాగ‌నంపిన చెవిరెడ్డి త‌న‌యుడు..

చిత్తూరు జిల్లా, చంద్రగిరి నియోజకర్గంలో రాయల చెరువు కట్ట లీకేజీని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో పూర్తి స్థాయిలో అరికట్టారు. ఈ ముప్పు తప్పిన నేపథ్యంలో తిరుచానూరు శ్రీపద్మావతి నిలయం అతిథి గృహంలో వారం రోజుల పాటు తలదాచుకున్న 25 గ్రామాల ప్రజల్ని వారి స్వగ్రామాలకు ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి లక్ష్మీ, తనయుడు, తిరుపతి రూరల్ ఎంపీపీ మోహిత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు. తిరుచానూరు శ్రీపద్మావతీ నిలయం పునరావాస కేంద్రంలో ఉన్న రామచంద్రాపురం, తిరుపతి రూరల్ లోని 25 గ్రామాల ప్రజలకు పట్టుచీర, ఆకు, వక్క, పసుపు, కుంకుమ, పండ్లతో కూడిన సారే దాదాపు వెయ్యి మంది మహిళలకు అందజేశారు. ప్రత్యేక వాహనాల్లో ప్రజలను తమ స్వగ్రామాలకు గౌరవంగా సాగనంపారు. నిర్వాసితులు సైతం సంతోషంగా తమ స్వగృహాలకు తరలి వెళ్లారు.

ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. టిటిడి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వారం రోజుల పాటు ఎలాంటి లోటు పాట్లు లేకుండా సకల సౌకర్యాలు కల్పించామన్నారు. నిర్వాసిత ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి చూశామని మోహిత్ రెడ్డి అన్నారు. అనంతరం లక్ష్మీ చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు అందజేశారు. అంతకుముందు లక్ష్మీ చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి నిర్వాసితులను ఆప్యాయంగా పలకరించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి కుటుంబ పెద్దగా తమ పట్ల ఆలోచించారని నిర్వాసితులన్నారు. నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు చక్కటి వసతి కల్పించారని పేర్కొన్నారు. తమకు ఏలోటు రానీకుండా సపర్యలు చేశారన్నారు. ఏ ఎమ్మెల్యే చేయలేని విధంగా ధైర్యం చేసి కట్ట నుంచి నీరు లీకేజీ అవుతున్నా.. తన ప్రాణాలను సైతం లెక్క చేయక రాయల చెరువుపైనే ఉంటూ తమను సురక్షిత ప్రాంతాలకు తరలించిన మహనీయుడు ఎమ్మెల్యే చెవిరెడ్డి అని కొనియాడారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement