Saturday, April 20, 2024

బెంగ‌ళూరు హాస్పిట‌ల్‌లో తారకరత్నను పరామర్శించిన చంద్రబాబు

కుప్పం, (ప్రభ న్యూస్ ): కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్రకు విచ్చేసిన సినీ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఇవ్వాల రాత్రి నందమూరి తారకరత్నను టీడీపీ అధినేత చంద్రబాబు ప‌రామ‌ర్శించారు. అయ‌న‌కు అందుతున్న చికిత్సపై డాక్టర్లతో మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలు అందించాల‌ని కోరారు.

అనంతరం తారకరత్న భార్య అలేఖ్య, తండ్రి మోహన కృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి దైర్యం చెప్పారు. తార‌క‌ర‌త్న గుండెపోటుతో కుప్ప‌కూలిపోయిన‌ప్పుడు అక్కడే ఉన్న బాలకృష్ణ ఈ సంద‌ర్భంగా మొత్తం విషయాలను చంద్రబాబుకు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement