Thursday, April 25, 2024

కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు..

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 11 నుంచి నాలుగు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 11న బెంగళూరు మీదుగా రోడ్డు మార్గంలో చంద్రబాబు కుప్పం చేరుకుంటారు. 11, 12వ తేదీల్లో కుప్పం మునిసిపాలిటీ, మండలంలో, 13న శాంతిపురం రామకుప్పం మండలాల్లో, 14న గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో ఆయన పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో స్థానిక నేతలు నిన్న ఏర్పాట్లను పరిశీలించి, సమీక్షించారు.

ఇది కూడా చదవండి: తాటాకు చప్పుళ్లకు లొంగే వ్యక్తిని కాదు: టీఆర్ఎస్ కు ఈటల వార్నింగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement