Friday, March 29, 2024

మెగాస్టార్ చిరంజీవికి చంద్రబాబు ఫోన్

మెగాస్టార్ చిరంజీవికి మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి సంబంధించి చిరంజీవితో ఫోన్లో మాట్లాడారు. సాయితేజ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే సాయితేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక శుక్రవారం తేజ్ హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. అలాగే కొంతమంది సినీ స్టార్లు ఆస్పత్రికి వెళ్లి సాయితేజ్‌ను పరమర్శిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement