Saturday, April 20, 2024

మాక్కూడా టైం వస్తుంది.. ఎవ్వరినీ వదిలిపెట్టం: చంద్రబాబు

తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. టీడీపీ దెబ్బకు సీఎం జగన్ కూడా ప్రచారానికి వస్తున్నాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘ఇంకొకాయన పుంగనూరు నుంచి వస్తున్నాడు పెద్ద మగాడు… పోతూ ఉంటే మనుషుల్ని తీసుకువచ్చి తొక్కించుకుంటూ వెళతాడట. మాక్కూడా సమయం వస్తుంది… మీరంతా జిల్లాలోనే ఉంటారు… మీలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టం… ఎక్కడున్నా పట్టుకొచ్చి మరీ మా వాళ్ల కోరిక తీరుస్తా. నేను రాజకీయాలు చేస్తుంటే గోలీ కాయలు ఆడుకునే వ్యక్తి వచ్చి ఏదో చేస్తాడంట’ అని మండిపడ్డారు. పరిషత్ ఎన్నికల బరిలో టీడీపీ లేకపోయినా రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. వైసీపీ అరాచకాలకు భయపడవద్దని, ఎదురొడ్డి నిలిచే కార్యకర్తలకు భవిష్యత్‌లో సన్మానం చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇవాళ జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి పరిగెత్తుకుంటూ తిరుపతి వస్తున్నాడంటే అది మీ చలవేనని టీడీపీ కార్యకర్తల్లో చంద్రబాబు హుషారు నింపే ప్రయత్నం చేశారు. న్యాయం, ధర్మం నిలిపే సైనికులే టీడీపీ కార్యకర్తలని, తన కార్యకర్తలే తన సైన్యమని ఉద్ఘాటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement