Thursday, April 25, 2024

శ్రీలంకతో సిరీస్‌కు గాయంతో చాహర్‌ ఔట్‌..

భారత్‌ -శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌ రేపటి నుంచి ప్రారంభం కానుంది. బుధవారం లక్నో వేదికగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది. ఈక్రమంలో సిరీస్‌కు ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్‌గా అద్భుత ప్రదర్శనతో రాణిస్తున్న పేసర్‌ దీపక్‌ చాహర్‌ గాయంతో శ్రీలంక సిరీస్‌కు దూరమయ్యాడు. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు దూరమైన చాహర్‌ బయోబబుల్‌ను వీడాడు.

విండీస్‌తో జరిగిన చివరి టీ20లో చాహర్‌కు తొడ కండరాలు పట్టేయడంతో మైదానాన్ని వీడాడు. వైద్యుల పరీక్షల అనంతరం గాయం తీవ్రమైనదిగా తేలడంతో సిరీస్‌కు దూరమయ్యాడు. చాహర్‌ కోలుకునేందుకు 5నుంచి 6వారాలు పడుతుందని సమాచారం. మరోవైపు ఐపీఎల్‌ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో రూ.14కోట్లకు చాహర్‌ను కొనుగోలు చేసిన సీఎస్కే శిబిరంలోనూ ఆందోళన నెలకొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement