Thursday, April 25, 2024

సెంట్రల్ విస్టా విచారణ..సుప్రీంకోర్టులో ప్రస్తుతం జడ్జిల కొరత ఉంది: సీజేఐ ఎన్వీ రమణ

కరోనా కల్లోల సమయంలో ఢిల్లీలో సెంట్రల్ విస్టా నిర్మాణం కొనసాగుతుండటంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంటు భవనంతో పాటు, అత్యంత ఆధునికమైన టెక్నాలజీతో ప్రధాని నివాసాన్ని కూడా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా వేశారు. ఈ పిటిషన్లను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. వాదనల సందర్భంగా పిటిషన్ల తరపున వాదిస్తూ సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ్ లూథ్రా మాట్లాడుతూ, మే 17 తర్వాత కానీ ఈ అంశాన్ని విచారించలేమని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పరిగణనలోని తీసుకోవాలని చెప్పారు.

ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ స్పందిస్తూ, కరోనా నేపథ్యంలో జడ్జిల కొరత కూడా ఉందని చెప్పారు. బెంచ్ అందుబాటులోకి వస్తే కేసును విచారిస్తామని అన్నారు. వాదనల సందర్భంగా పిటిషనర్లు వాదిస్తూ.. కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించడంపై తమకు అభ్యంతరం లేదని.. కాకపోతే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో రాజ్ పథ్, ఢిల్లీ గేట్ సమీపంలో పనులు కొనసాగడంపై ఆందోళన చెందుతున్నామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement