Tuesday, March 26, 2024

అంతర్జాతీయ విమానాలపై మే 31 వరకు నిషేధం పొడిగింపు

అంత‌ర్జాతీయ విమానాల‌పై నిషేధాన్ని మే 31 వ‌ర‌కు కేంద్రం పొడిగించింది. దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. అంత‌ర్జాతీయ విమాన ప్ర‌యాణాల‌పై నిషేధానికి సంబంధించి గ‌తంలో జారీ చేసిన ఉత్త‌ర్వుల చెల్లుబాటును మే 31 అర్థ‌రాత్రి వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్ర‌వారం తెలిపింది. దేశం నుంచి లేదా దేశంలోకి అంత‌ర్జాతీయ ప్ర‌యాణ విమానాల‌పై గ‌తంలో విధించిన నిషేధం కొన‌సాగుతుంద‌ని పేర్కొంది.

అయితే అంత‌ర్జాతీయ కార్గో విమానాల‌కు ఈ నిబంధ‌న‌లు వ‌ర్తించ‌వ‌ని చెప్పింది. అలాగే కొన్ని ప‌రిస్థితుల్లో, కొన్ని మార్గాల్లో అంత‌ర్జాతీయ ప్ర‌యాణ విమానాల‌ను అనుమ‌తిస్తామ‌ని డీజీసీఏ వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement