Wednesday, April 24, 2024

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో అఫిడవిట్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంలేదు. ప్రైవేటీకరణపై స్పష్టతిస్తూ బుధవారం ఉదయం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా అఫిడవిట్‌లో కీలక అంశాలను పేర్కొంది. అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలిస్తామని కేంద్రం తెలిపింది. 100 శాతం స్టీల్ ప్లాంట్‌ను అమ్ముతామని, ఇప్పటికే బిడ్డింగ్‌ను ఆహ్వానించామని కేంద్రం అఫిడవిట్‌లో వెల్లడించింది. పిటిషన్ వేసిన జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారని, ఆయన రాజకీయ ఉద్దేశంతోనే పిటిషన్ దాఖలు చేశారని, దీనికి విచారణ అర్హత లేదని అఫిడవిట్‌లో కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం కోర్టులో విచారణ కొనసాగుతోంది.

మరోవైపు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని నిరసనలు వ్యక్తమవుతున్నాయి. స్టీల్ ప్లాంట్‌ను అమ్మేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి విశాఖ వాసులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని కోరుతున్నారు. అన్ని పార్టీల నాయకులు కూడా ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం, అందులో పేర్కొన్న అంశాలు మరింత అందోళనకు గురిచేస్తుండటంతో నిరసనలు మరింత ఉధృతమవుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ వార్త కూడా చదవండి: ప.గో. జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థి కిడ్నాప్, దారుణహత్య

Advertisement

తాజా వార్తలు

Advertisement