Thursday, April 25, 2024

సీబీఎస్‌ఈ పదో తరగతి టర్మ్‌-1 ఫలితాలు విడుదల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సీబీఎస్‌ఈ పదో తరగతి టర్మ్‌-1 ఫలితాలు విడుదలయ్యాయి. సీబీఎస్‌ఈ 10వ తరగతి 2021-22 సెషన్‌ టర్మ్‌-1 పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఆఫ్‌లైన్‌లో మాత్రమే విడుదల చేశామని సీబీఎస్‌ఈ బోర్డు ఈమేరకు ట్వీట్‌ చేసింది. పూర్తి ఫలితాలను వెబ్‌సైట్‌లో పెట్టలేదని, మార్కుల షీట్‌లను వారి వారి స్కూళ్లకు పంపించినట్లు తెలిపింది.
ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్థులు తమ స్కూళ్లను సంప్రదించాలని పేర్కొంది.

సీబీఎస్‌ఈ టర్మ్‌-2 ఫలితాల అనంతరం పూర్తి స్థాయి మార్కుల షీట్‌ను విద్యార్థులకు అందిస్తామని తెలిపింది. 12వ తరగతి ఫలితాలనూ త్వరలోనే ప్రకటించనుంది. గత ఏడాది నవంబర్‌, డిసెంబర్‌లో జరిగిన 10, 12 తరగతి టర్మ్‌-1 పరీక్షలకు 36 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement