Saturday, April 20, 2024

సీబీఎస్‌ఈ పరీక్షల రద్దుపై విచారణ సోమవారానికి వాయిదా

కరోనా తీవ్రత నేపథ్యంలో 12వ తరగతి సీబీఎస్‌ఈ పరీక్షలు రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం నాడు విచారణ జరిగింది. సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేసేలా బోర్డుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ లాయర్ మమతా శర్మ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కొంతకాలంగా విచారణ జరుగుతోంది.

ఇప్పటికే 10వ తరగతి సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం 12వ తరగతి పరీక్షలను మాత్రం వాయిదా వేసింది. కాగా 12వ తరగతి పరీక్షలపై జూన్ 1న నిర్ణయం తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది. జూలై 15 నుంచి ఆగస్టు 28 వరకు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement