Wednesday, April 17, 2024

Big Breaking | తెలంగాణ ప్ర‌భుత్వానికి సీబీఐ లేఖ‌.. ఫామ్ హౌస్ కేసులో ఎఫ్ ఐ ఆర్ న‌మోదుపై ప‌రిశీలిస్తున్న‌ట్టు వెల్ల‌డి

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ ప్ర‌భుత్వానికి సీబీఐ లేఖ రాసింది. ఫామ్ హౌస్ కేసు సీబీఐకి బ‌దిలీ చేసిన క్ర‌మంలో ఎఫ్ ఐ ఆర్ న‌మోదుకు అన్ని అంశాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు ఆ లేఖ‌లో పేర్కొంది. కాగా, హైకోర్టు సింగిల్ బెంచ్ సిట్ ఏర్పాటును కొట్టివేస్తూ ఈ కేసును సీబీఐకి అప్ప‌గించింది. ఈ క్ర‌మంలో సీబీఐ కేసును టేకోవ‌ర్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ కేసుపై తెలంగాణ ప్ర‌భుత్వం హైకోర్టు డిజిజ‌న్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లింది. కేసు ద‌ర్యాప్తు సీరియ‌స్‌గా జ‌రుగుతోంద‌ని, ప్ర‌భుత్వాన్ని కూల్చే కుట్ర కోణం ఉంద‌ని హైకోర్టుకు నివేదించింది. దీనిపై ఇంకా విచార‌ణ జ‌ర‌గాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement