Friday, April 19, 2024

RRRకు సీబీఐ కోర్టు ఝలక్

అక్రమాస్తుల కేసుల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో మంగళవారం నాడు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. RRR వేసిన పిటిషన్‌ విచారణకు అర్హత లేదంటూ సీబీఐ కోర్టు తిప్పిపంపింది. కాగా ఈ కేసులో వారం వారం విచారణ జరుగుతున్నా జగన్ మాత్రం కోర్టుకు హాజరయ్యే విషయంలో మినహాయింపు కూడా పొందుతున్నారు. దీనిపై వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. జగన్‌కు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని ఆయన పిటిషన్‌లో కోరారు. దీనిపై బుధవారం విచారణ జరగాల్సి ఉండగా.. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్ధానం తిప్పి పంపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement