Tuesday, April 23, 2024

పరిటాల శ్రీరామ్ పై 324 సెక్షన్ కింద కేసు

మాజీ మంత్రి పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీ రామ్ పై కేసు నమోదు అయింది. అనంతపురం జిల్లా రాప్తాడు టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న శ్రీ రామ్ పై చెన్నేకొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ముష్టికోవెల గ్రామంలో YSRCP కార్యకర్త వెంకట్రాముడుపై దాడి చేసిన ఘటనలో [పరిటాల శ్రీరామ్, తో పాటు మరో 9 మందిపై కేసు నమోదు అయింది.

పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ కి మద్దతు ఇచ్చినందుకే ఇలా దాడి చేశారని బాధిత వర్గం ఫిర్యాదు లో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పరిటాల శ్రీరామ్ పై 324 సెక్షన్ కింద కేసు నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement