Friday, April 26, 2024

కారులో చెలరేగిన మంటలు..

వికారాబాద్‌ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధమయింది. జిల్లాలోని కొడంగల్ మండలం కస్తూర్‎పల్లి వద్ద హైదరాబాద్ నుంచి గుల్బార్గా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును ఆపివేశాడు. అందులో ఉన్నవారంతా కిందికి దిగడంతో అంతా క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఇకపై పాఠ్య‌పుస్త‌కాల్లో క‌రోనా పాఠాలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement