Friday, April 19, 2024

మానవత్వం చాటుకున్న మంత్రి గంగుల

సిద్దిపేట , రామునిపట్ల సమీపంలో కారు ప్రమాదం జరిగింది, ఆ మార్గంలో హైదరాబాద్ వెళ్తున్న రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఘటనను చూసి వెంటనే ఆగారు. కారు ప్రమాదం లో గాయపడిన వారిని చూసి హుటా హుటిన స్పందించి తన కార్ లో, తన వ్యక్తి గత సిబ్బందిని తోడుగా పంపి సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకి మెరుగైన వైద్యం కోసం పంపించారు. అక్కడి డాక్టర్లతో మాట్లాడి సరైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు. స్విప్ట్ డిజైర్ కారును నడుపుతున్న వ్యక్తి అదుపుతప్పి కల్వర్టుకు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సహాయంతో వారిని కాపాడి ఆసుపత్రికి పంపిచారు. కారును నడుపుతున్న వ్యక్తి అతని భార్య , కూతురు, అల్లుడు, మరొకరు మొత్తం ఐదుగురు ఉన్నారు… బాదితులు హైదరాబాద్ వాసులు కాగా కరీంనగర్ కు ఫంక్షన్ వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement