Friday, March 29, 2024

గుంటూరు – గుంతకల్లు మార్గంలో పలు రైళ్ళ రద్దు.. ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారుల విజ్ఞప్తి

గుంటూరు, ప్రభన్యూస్‌ బ్యూరో: గుంటూరు – గుంతకల్లు రైలుమార్గంలో బేతంచర్ల – మల్కాపురం – రంగంపురం సెక్షన్‌లో పనుల కారణంగా పలు రైళ్లని రద్దు చేస్తున్నట్లు డీఆర్‌ఎం ఎం రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 23 నుంచి 25 వరకు నెం.07067 మచిలీపట్నం – కర్నూలు టౌన్‌, ఈ నెల 24వ తేదీ నుంచి 26వరకు నెం.07068 కర్నూలు టౌన్‌ – మచిలీపట్నం స్పెషల్‌ ట్రైన్‌, ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు నెం.17251 గుంటూరు – కాచీగూడ, 21 నుంచి 27వ తేదీ వరకు నెం.17252 కాచీగూడ – గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లని పూర్తిగా రద్దు చేస్తున్నామన్నారు. నెం.17228 గుంటూరు – డోన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు నంద్యాల వరకే నడుపుతామన్నారు. నెం.17227 డోన్‌ – గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ని ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు డోన్‌ – నంద్యాల మధ్యన పాక్షికంగా రద్దు చేసి నంద్యాల నుంచి గుంటూరుకు నడపడం జరుగుతుందన్నారు.

- Advertisement -

నెం.17253 గుంటూరు – సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ని ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు గుంటూరు నుంచి కాకుండా డోన్‌ నుంచి సికింద్రాబాద్‌కు నడుపుతామన్నారు. నెం.17254 సికింద్రాబాద్‌ – గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు డోన్‌ వరకే నడుపుతామన్నారు. అలానే నెం.17211 మచిలీపట్నం – యశ్వంత్‌పూర్‌ కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 22, 24 తేదీల్లో, నెం.17212 యశ్వంత్‌పూర్‌ – మచిలీపట్నం కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ని ఈ నెల 23, 25 తేదీల్లో యర్రగుంట్ల, గుత్తికొండ మీదగా దారి మళ్లిస్తామన్నారు. నెం.18463 భువనేశ్వర్‌ – బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు, నెం.18464 బెంగళూరు – భువనేశ్వర్‌ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ని ఈ నెల 22, 23, 24, 25 తేదీల్లో, నెం.22883 పూరీ – యశ్వంత్‌పూర్‌ గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 24న, నెం.22884 యశ్వంత్‌పూర్‌ – పూరీ గరీబ్‌రథ్‌ రైలుని, ఈ నెల 22న నెం.22831 హౌరా – సత్యసాయి ప్రశాంతి నిలయం, ఈ నెల 24న సత్యసాయి ప్రశాంతి నిలయం – హౌరా ఎక్స్‌ప్రెస్‌ని యర్రగుంట్ల, గుత్తికొండ మీదగా దారి మళ్లిస్తారన్నారు. ఈ విషయాన్ని ప్రయాణీకులు గమనించి రైల్వేకి సహకరించాలని డీఆర్‌ఎం విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement