Friday, April 19, 2024

షాకింగ్: మాస్క్ ధరిస్తే భారీ జరిమానా

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అంతటా మాస్క్ తప్పనిసరి అయ్యింది. మాస్క్ ధరించని వారికి కొన్ని చోట్ల భారీ మొత్తంలో అధికారులు జరిమానా కూడా విధించడాన్ని చూస్తూనే ఉన్నాం. కానీ.. ఓ కేఫ్‌లో మాత్రం ఈ పరిస్థితికి పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ మాస్క్ ధరిస్తే.. ఫైన్ విధిస్తారు. వినడానికి విచిత్రంగానే ఉన్నా.. ఇదే నిజం. అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న ఫిడిల్‌హెడ్స్ కేఫ్ యజమాని అక్కడికొచ్చిన కస్టమర్లుకు ఫైన్ వేస్తున్నాడు. కేఫ్‌కు వచ్చిన కస్టమర్లకు ఈ విషయాన్ని ముందే చెబుతున్నాడు కూడా. కేఫ్‌లోని గోడలపై పెద్దపెద్ద అక్షరాలతో ‘ఎవరైనా ఆర్డర్ చేసేటపుడు మాస్క్ ధరిస్తే 5 డాలర్లు.. టీకా తీసుకున్న విషయాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటే మరో ఐదు డాలర్ల ఫైన్ విధించబడును’ అని రాసి ఉన్న గమనికను చూపించి మరీ వసూలు చేస్తున్నాడు. అయితే ఫైన్ సంగతి తెలుసుకుని కస్టమర్లు షాక్ అవుతున్నారు. అయితే ఓ స్వచ్ఛంద సంస్థ కోసమే ఇలా చేస్తున్నాడని తెలుసుకుని పోటీపడి మరీ కస్టమర్లు జరిమానాలు చెల్లిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement