Friday, April 19, 2024

వివాదంలో డైరీ మిల్క్ చాక్లెట్

చాలామంది క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్లను ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా పిల్లలు ఈ చాక్లెట్లను ఎంతో ఇష్టపడతారు. అయితే ఈ సంస్థ ఓ వివాదంలో ఇరుక్కుంది. క్యాడ్బరీ చాక్లెట్లలో గొడ్డుమాంసం నుంచి తయారయ్యే జెలాటిన్ వాడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దానికి సంబంధించిన ఓ ఫొటో క్యాడ్బరీ వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చింది.

దీంతో ఇది నిజమేనా అని క్యాడ్‌బరీ సంస్థను ఓ నెటిజన్ ప్రశ్నించాడు. అంతేకాదు.. ఇదే కనుక నిజమైతే హలాల్ సర్టిఫైడ్ బీఫ్ ప్రొడక్ట్స్‌ను హిందువులచే బలవంతంగా తినిపించినందుకు క్యాడ్‌బరీపై కేసు పెట్టాల్సిందేనని ట్విట్ చేశాడు. ఈ నేపథ్యంలో సంస్థ ఉత్పత్తులను భారత్‌లో నిషేధించాలని డిమాండ్ వినిపిస్తోంది.

ఈ వివాదంపై క్యాడ్‌బరీ డైరీ మిల్క్ స్పందించింది. గొడ్డు మాంసంపై క్లారిటీనిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో తయారువుతున్న , అమ్ముతున్న క్యాడ్‌బరీ ఉత్పత్తులు 100 శాతం వెజిటేరియన్ అని తెలిపింది. అంతేకాదు వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్.. క్యాడ్‌బరీ భారతీయ ఉత్పత్తులకు సంబంధించినది కాదని తెలిపింది. క్యాడ్‌బరీ చాక్లెట్ ర్యాపర్‌పై ఉన్న ఆకుపచ్చ చుక్క శాఖాహారం అన్న విషయాన్ని సూచిస్తుందని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

ఈ వార్త కూడా చదవండి: 1800 యాప్‌లను తొలగించిన గూగుల్.. కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు

Advertisement