Wednesday, April 24, 2024

బ‌స్సుని ఢీ కొన్న లారీ – ఒక‌రు మృతి- ఐదుగురికి గాయాలు

బస్సు ని ఓ లారీ బ‌లంగా ఢీ కొంది. ఈ ప్ర‌మాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. కాగా ఈ ఘ‌ట‌న‌లో మ‌రో ఐదుగురు గాయ‌ప‌డ్డారు.. 38 మంది యాత్రికులతో ఓ ట్రావెల్స్ బస్సు నిజామాబాద్ నుంచి కాశీయాత్రకు బయలుదేరింది. బీహార్‌లోని ఔరంగాబాద్‌కు చేరుకున్న తర్వాత ఓ హోటల్ వద్ద బస్సును ఆపేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వెనక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టడంతో బోల్తా పడింది.ఈ ఘటనలో నిజామాబాద్ జిల్లాలోని వెల్మడ్‌కు చెందిన 70 ఏళ్ల సరలమ్మ మృతి చెందింది. గాయపడిన ఐదుగురిని వెంటనే ఔరంగాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ బస్సులో నిజామాబాద్‌ జిల్లాలోని వెల్మల్, దత్తపూర్, తలవేద, డొంకేశ్వర్ గ్రామాలకు చెందిన వారితోపాటు నిర్మల్ జిల్లా బాసరకు చెందిన యాత్రికులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement