Friday, March 29, 2024

బ‌స్సు బ్రేకులు ఫెయిల్ – మ‌రో బ‌స్సుని ఢీ – 12మందికి గాయాలు

ఆర్టీసీ బ‌స్సు బ్రేకులు ఫెయిల్ అయి మ‌రో బస్సుని ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో 12మందికి గాయాల‌య్యాయి. దాంతో క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స్థానిక హాస్ప‌ట‌ల్ కి త‌ర‌లించారు. హైద‌రాబాద్ , నాగార్జున‌సాగ‌ర్ ర‌హ‌దారిపై బీఎన్ రెడ్డిన‌గ‌ర్ వ‌ద్ద ఈ ప్ర‌మాదం జ‌రిగింది. వెనుకనుంచి బస్సు ఢీకొట్టడంతో ముందున్న కారును బస్సు ఢీ కొట్టింది.ఘటనలో ఇలా వరుసగా 2 బస్సులు, 3 కార్లు ఢీకొట్టుకున్నాయి.పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని కేసు న‌మోదు చేసుకున్నారు. ఈ మేర‌కు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement