Thursday, April 18, 2024

బస్సు, కారు ఢీ.. ఇద్దరు మృతి

బ‌స్సు, కారు ఢీకొని ఇద్ద‌రు మృతి చెందిన ఘ‌ట‌న విశాఖప‌ట్నంలోని భీమిలి వలందపేటలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికుల ద్వారా స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. ఈ మేర‌కు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన లాడే దుర్గాప్రసాద్, పట్నాల సంతోష్‎గా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాలను కేజీహెచ్ మార్చురీకి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement