Monday, April 15, 2024

లాక్ డౌన్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణలో లాక్ డౌన్ పెట్టటం పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంకు మేము పూర్తిగా మద్దతిస్తామని లాక్ డౌన్ విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి నిర్ణయాధికారాన్ని అప్పగించిందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు… పూర్తిస్థాయి, పాక్షిక లాక్ డౌన్ ప్రకటించారన్నారు. ఆలస్యమైనా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిందని.. లాక్ డౌన్ సమయంలో వైద్య సేవలు, పేషెంట్ల ప్రయాణాలకు ఆటంకం కలగకుండా టెస్ట్ లో ట్రీట్మెంట్ ఆగకుండా చూడాలి అని ప్రభుత్వానికి సూచించారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ మాత్రమే కరోనా ను కట్టడి చేయగలదని ఈ లాక్ డౌన్ సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని అన్నారు. రాష్ట్రానికి అవసరం ఉన్నంత ఆక్సిజన్, రెమ్ డెసీవర్ ఇంజెక్షన్లను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పంపించిందని… ఆక్సిజన్, రెమ్ డిసీవర్ ఇంజెక్షన్ల పంపిణీ కోసం ప్రత్యేక నోడల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement