Thursday, March 28, 2024

Bull Run – రెండో రోజూ లాభాల భాట‌లో స్టాక్ మార్కెట్…

ముంబై – దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. ఈ ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే లాభాల్లోకి దూసుకుపోయాయి. చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగింది. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 629 పాయింట్లు లాభపడి 62,502కి పెరిగింది. నిఫ్టీ 178 పాయింట్లు పుంజుకుని 18,499కి ఎగబాకింది.

సెన్సెక్స్‌ సూచీలో రిలయన్స్‌, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌యూఎల్‌, విప్రో, టెక్‌ మహీంద్రా, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టాటా స్టీల్‌, టైటన్‌, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ షేర్లు మాత్రమే నష్టాలు నమోదు చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement