Saturday, April 20, 2024

Mumbai : కూలిన భవనం.. 10కి చేరిన మృతుల సంఖ్య

ముంబైలో ఈరోజు ఉదయం నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ప్రమాద సమయంలో ఒకరు మృతిచెంద‌గా.. పలువురు శిథిలాల్లో చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు రెస్క్యూటీమ్‌ రంగంలోకి దిగింది. శిథిలాల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్ప‌టి వ‌ర‌కు మృతిచెందిన వారి సంఖ్య 10కి చేరుకుంది. రెస్క్యూటీమ్‌ ఎంతో శ్రమించి ప‌లువురిని రక్షించింది. మొత్తం భవనం కూలిపోయే సమయంలో 50 మందికి పైగా ఈ భవనంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement