Thursday, April 25, 2024

రూ.400 కోసం హైదరాబాద్‌లో దారుణ హత్య.. తోటి కూలి ప్రాణాలు తీసిన మరో కూలి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కేవలం రూ. 400 కోసం ఓ కూలీ తన కూలీని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. రూ.400 కోసం ఇద్దరి మధ్య జరిగిన గొడవ.. ఘర్షణకు దారి తీసింది. దీంతో కోపోద్రికుడైన ఓ వ్యక్తి ఎదుటి వ్యక్తిని దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌ బాలానగర్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫుట్‌పాత్‌పై పడుకుంటూ రోజువారీ కూలీ పనిచేసుకునే ఇద్దరుకూలీలు కాశీరాం, శ్రీనివాస్‌ రూ.400 కోసం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

తమకు కూలీ ఆదాయంగా వచ్చిన రూ.400 కోసం ఇరువురి వాగ్వాదం జరిగింది. నర్సాపూర్‌ చౌరస్తా లోని ఫుత్‌పాత్‌ పై ఇద్దరు మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. ఈక్రమంలో శ్రీనివాస్‌నుకాశీరాం కర్రతో కొట్టాడు. అటుగా వెళ్తున్న లారీ కిందకు తోసేశాడు. దీంతో శ్రీనివాస్‌ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement