Friday, April 19, 2024

Breaking : ‘ష‌ర్మిల’ పాద‌యాత్ర‌కి బ్రేక్.. ఎన్నిక‌ల కోడ్ అనంత‌రం రీ స్టార్ట్..

వైఎస్ ఆర్ టీపీ పార్టీ అధినేత వైఎస్ ష‌ర్మిల పాద‌యాత్ర‌కి ఎన్నిక‌ల కోడ్ అడ్డంకిగా మారింది. దాంతో ష‌ర్మిల పాద‌యాత్ర‌కి బ్రేక్ లు ప‌డ్డాయి. ఎన్నిక‌ల కోడ్ ముగియ‌గానే మ‌ళ్ళీ పాద‌యాత్ర పునఃప్రారంభం కానుంద‌ని ఆమె వెల్ల‌డించారు. తెలంగాణలో గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి సమగ్ర అవగాహనను ఏర్పరచుకోవడానికి ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల మహా పాదయాత్రకి శ్రీకారం చుట్టారు.. బుధ‌వారం నాటికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. అక్టోబ‌ర్ నెల 20వ తేదీన ఆమె రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో తన పాదయాత్రను మొదలు పెట్టారు. మొత్తం 90 అసెంబ్లీ, 14 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4,000 కిలోమీటర్ల పాటు ఈ మహా పాదయాత్ర కొనసాగాల్సి ఉంది. ఈలోగా ఆమె పాద‌యాత్ర‌కి బ్రేకులు ప‌డ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement