Friday, March 29, 2024

Breaking : తిరుమ‌ల‌లో ఒంటికి నిప్పంటించుకుని మహిళ ఆత్మహత్య

తిరుమ‌ల‌లోని వరాహస్వామి రెస్ట్ హౌస్ ఎదురుగా మరుగుదొడ్డిలో ఒంటికి నిప్ప‌టించుకుని మహిళ ఆత్మహత్యకు పాల్ప‌డింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని ఘ‌ట‌న‌కు గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. పూర్తిగా కాలిపోయిన‌ మ‌హిళ మృత‌దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతురాలు విజయవాడకు చెందిన సుమతి (53)గా పోలీసులు గుర్తించారు. ఈ మేర‌కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement