Friday, March 29, 2024

Breaking : నాకు నా భర్త కావాలి – బాధితురాలు సనా – పోలీస్ స్టేష‌న్ ముందు నిర‌స‌న‌

మదనపల్లి ప్రభ న్యూస్ : నా భర్త ..నాకు కావాలంటూ సనా అనే యువతి మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చెప‌ట్టింది..తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు చెందిన సనా అనే యువతి ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లా పోతబోలు పంచాయతీ దిగువ గాండ్ల పల్లికి చెందిన రమేశ్ కుమార్ లు ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.కొద్ది రోజులు సజావుగా కాపురం చేశారు..సజావుగా కాపురాం సాగిస్తున్న తరుణంలో తన అత్త మామలు.. తన భర్త కు వేరే పెళ్లి చెయ్యాలనే ఉద్దేశ్యంతో
రమేష్ కుమార్ తల్లిదండ్రులే తన భర్తను దాచిపెట్టారని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది..ఈ నెల 10 తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసినా.. నేటివరకు ఎటువంటి విచారణ చేప‌ట్ట‌కుండా .. త‌న‌కి న్యాయం చేయ‌లేద‌ని మదనపల్లి తాలూకా పోలిస్ స్టేషన్ ఎదుట నిరసన చేప‌ట్టింది..పైగా విడాకులు తీసుకోమని పోలీసులు ఉచిత సలహాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది..తినడానికి ఆహారం,ఉండడానికి ఇల్లు లేకపోగా తన అత్త మామలు వేధింపులకు గురి చేస్తున్నారని..యువతి మీడియా ముందు కన్నీరు మున్నీరు గా విలపించింది.న్యాయం జరిగేవరకు ఇక్కడి నుండి వెళ్లనని బిష్మించుకు కూర్చుంది..ఇప్పటికైనా డి.యస్.పి ,ఎస్పీ ,లు చొరవ తీసుకుని న్యాయం చేయాల‌ని వేడుకుంటోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement