Thursday, April 25, 2024

Breaking : ‘మాండూస్’ బాధితులను ఆదుకుంటాం : సీఎం స్టాలిన్‌

తమిళనాడులో మాండూస్‌ తుఫాన్‌ ప్రభావంతో పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ పర్యటించారు. బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్ర‌భావిత బాధితులకు నష్టపరిహారం అందిస్తామని సీఎం స్టాలిన్‌ హామీ ఇచ్చారు. తుఫాన్ కార‌ణంగా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement