Wednesday, April 24, 2024

Breaking : లోయలోకి దూసుకెళ్లిన వాహనం.. ఐదుగురు మృతి..

జమ్ముకశ్మీర్‌లోని ధనుపరోల్‌ దగ్గర అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి వాహనం లోయలో పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఆయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement