Thursday, April 25, 2024

Breaking : వాగులో ఈత‌కి దిగి విద్యార్థులు గ‌ల్లంతు…ఇద్దరు మృతి

మొగుళ్ళపల్లి (ప్రభ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం కొరికిశాలలో విషాదం చోటుచేసుకుంది. టిఎస్ మోడల్ పాఠశాలకు చెందిన తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు సోమవారం పాఠశాల కు అని బయలుదేరి మార్గ మధ్యలో ఉన్న వాగులో ఈతకు దిగి గల్లంతయ్యారు. అటువైపు ఎవరు లేకపోడంతో ఈ విషయం ఆలస్యంగా బయటి వచ్చింది. సమాచారం అందుకున్న గ్రామస్థులు సోమవారం రాత్రి నుండి వాగులో గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరి విద్యార్థుల మృతదేహాలు మంగళవారం ఉదయం లభ్యమయ్యాయి . మృతి చెందిన వారిలో బండారి అఖిల్ మొగుళ్ళపల్లి, యు. హర్షవర్ధన్ రంగాపూర్ కు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటన స్థలం కు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థుల మృతితో గ్రామంతో పాటు మండలంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement