Thursday, April 25, 2024

Breaking : కాంగ్రెస్‌ నేతల్లో మార్పు రావాలి : కాంగ్రెస్‌ నేత వీహెచ్‌

కాంగ్రెస్‌లో అందరూ కలిసి కట్టుగా పనిచేస్తేనే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేతల్లో మార్పు రావాలన్నారు. నేతలంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. కమిటీలు వేయగానే సరిపోదని, కమిటీల్లో బలహీన వర్గాలకు అవకాశం ఇవ్వాలని సూచించారు. ఇది ప్రైవేట్‌ కంపెనీ కాదని.. డెమెక్రసీ అన్నారు. పెద్దలీడర్ల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు అందరూ కలిసి పనిచేస్తేనే అధికారంలోకి వస్తామని వీహచ్‌ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement