Thursday, April 18, 2024

Breaking : తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా డేంజ‌ర్ బెల్స్ – ఏపీలో 10 వేల కేసులు

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా డేంజ‌ర్ బెల్స్ ని మోగిస్తోంది. ఏపీలో ప‌దివేలు దాటాయి రోజువారీ క‌రోనా కేసులు. దాంతో హాస్పిట‌ల్స్ వెంట‌నే నోటిఫై చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది ప్ర‌భుత్వం. ఏపీలో కొత్త‌గా 10,057క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. ఎనిమిది మంది మృతి చెందారు. ఈ మేర‌కు ఆస్ప‌త్రిలో బెడ్స్ పెంచాల‌ని ఏపీ ప్ర‌భుత్వం తెలిపింది. 18.38శాతానికి పాజిటివిటీ రేటు పెరిగింది. ఏపీలో మొత్తం 21,27,441కేసులు న‌మోదు అయ్యాయి. 14,522మంది మృతి చెందారు. 44,935యాక్టివ్ కేసులు ఉండ‌గా, 20,67,984మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణ‌లోనూ క‌రోనా కేసులు భారీగా పెరిగాయి. ఒక్క‌రోజులోనే దాదాపు మూడు వేల కేసులు న‌మోద‌య్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement