Thursday, April 25, 2024

Breaking : ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ లో తొక్కిస‌లాట.. ఇద్ద‌రు విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త‌..

విజ‌య‌న‌గ‌రం : ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ లో తొక్కిస‌లాట చోటుచేసుకుంది. ఒకే బోగీలో దాదాపు 200 మంది ప్ర‌యాణికులు ఎక్కిన‌ట్లు అధికారులు గుర్తించారు. ఊపిరాడ‌క విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. ఇందులో ఇద్ద‌రు విద్యార్థులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. విజ‌య‌న‌గ‌ర రైల్వే స్టేష‌న్ లో విద్యార్థులు దింపేసిన పోలీసులు.. ప్రైవేట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే వీరు ప్ర‌కాశం జిల్లా కుంభంలో బీఈడీ ప‌రీక్ష రాసి స్వ‌స్థ‌లం ఒడిషాకు వెళుతుండ‌గా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంద‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement