Monday, April 15, 2024

Breaking : రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

జక్రాన్ పల్లి ప్రభ న్యూస్ : మండలంలోని జక్రాన్ పల్లి గ్రామానికి చెందిన నట్ట సాయన్న తండ్రి బాబన్న అనే వ్యక్తిని మంగళవారం రాత్రి జక్రాన్ పల్లిలో గల బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని వెళ్లినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అతని ఆరోగ్యం క్రిటికల్ గా ఉన్నట్లు తెలిపారు. తదుపరి వివరాలు పిటిషన్ వచ్చిన తర్వాత తెలియజేస్తామని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement