Thursday, March 28, 2024

Breaking : ‘అమ‌ర‌వీరుల’ కుటుంబాల‌కి అంద‌ని ప‌రిహారం.. రేవంత్ రెడ్డి..

తెలంగాణ అమర వీరుల కుటుంబాలను గుర్తించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. వారికి పరిహారం ఇవ్వలేదని మండిప‌డ్డారు. టీఆర్ఎస్ పాలనలో ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 7,500 మంది రైతులు చనిపోయారు. అనధికారిక లెక్కల ప్రకారం 40 వేల మంది చనిపోయారు. వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వ‌లేద‌న్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో వరదబాధిత కుటుంబాలకు పరిహారం అంద‌లేద‌న్నారు. పంజాబ్ లో చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.3 లక్షలు ఇస్తాం అని సీఎం కేసీఆర్ చెబుతున్నారు.కేసీఆర్ ను ఎలా నమ్మేద‌ని రేవంత్ నిల‌దీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement