Tuesday, March 26, 2024

breaking news : గడ్చిరోలిలో భారీ ఎన్ కౌంట‌ర్ – ఏడుగురు మావోయిస్టుల హ‌తం

మ‌హారాష్ట్రలోని గ‌డ్చిరోలిలో భారీ ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది. గ్యార‌బ‌ట్టి అట‌వీ ప్రాంతంలో కాల్పులు జ‌రిగాయి. ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు. గడ్చిరోలి జిల్లాలోని ధనోరా తాలుక గ్యారబట్టి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే.. భీకర కాల్పుల్లో… ఏకంగా ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇంకా మావోయిస్టుల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది. కోర్చి పీయస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement