Thursday, April 25, 2024

Breaking : వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన‌ ఎమ్మెల్యే చెవిరెడ్డి..

తిరుపతి రూరల్ : చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తిరుపతి రూరల్ మండలం లో వరదల ధాటికి ముంపున‌కు గురైన ప్రాంతాలను చంద్రగిరి శాసనసభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిశీలించారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన అనంతరం అధికారులను వెంట బెట్టుకొని ముంపున‌కు గురైన ప్రాంతాలు, ప్రమాదకర స్థితిలో ఉన్న చెరువులను పరిశీలించారు. తిరుచానూరు, చిగురువాడ వద్ద స్వర్ణముఖి నదీ ప్రవాహానికి కూలిపోయిన బ్రిడ్జిలను ఆయన పరిశీలించారు .అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వాన నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. .ఎమ్మెల్యే వెంట ఇరిగేషన్ ఈ ఈ.శివారెడ్డి ఆర్డిఓ కనకనర్సారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement