Thursday, March 28, 2024

Breaking : కేటీఆర్ ని క‌లిసిన పోచంప‌ల్లి .. మంత్రులు ..

ఇటీవల వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఏకగ్రీవంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ , పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి తో కలిసి ప్రగతిభవన్ లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ పోచంపల్లి ని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవం కావడానికి కృషి చేసిన మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డిలను కేటీఆర్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement