Thursday, April 25, 2024

Mandous Cyclone : మాండూస్‌ బీభత్సం.. కుంభవృష్టితో తమిళనాడు పది జిల్లాలు అతలాకుతలం..

మాండూస్‌ తుపాను ప్రభావం తమిళనాడుపై భారీగా చూపిస్తోంది. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైతోపాటు పది జిల్లాలో కుంభవృష్టి కురుస్తోంది. కొన్ని జిల్లాల్లో ఆరెంజ్‌ అలెర్ట్‌ కొనసాగుతంది. ఇవాళ, రేపు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. తిరువన్నామలై జిల్లా వందవాసి నీటమునిగింది. చెన్నైలోని పులాల్‌, చెంబరపాకం రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. భారీ వర్షాలకు ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల సాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement